రైలు ప్రయాణంలో ఫోన్లు, పర్సులు, బ్యాగులు వంటి విలువైన వస్తువులను మర్చిపోతే కంగారు పడకుండా భారతీయ రైల్వే సూచించిన పద్ధతులను అనుసరించాలి. వెంటనే రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి కాల్ చేసి, పీఎన్ఆర్ నంబర్, రైలు నంబర్, కోచ్ నంబర్, సీటు నంబర్, వస్తువు వివరాలు అందించాలి. అలాగే స్టేషన్ మాస్టర్, RPF సిబ్బంది, లేదా TTEని సంప్రదించాలి. 'రైల్ మదద్' యాప్/పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసి, స్టేటస్ను ట్రాక్ చేసుకోవచ్చు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశాలున్నాయని రైల్వే తెలిపింది.