దేవరకద్ర మున్సిపాలిటీలో బుధవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల సహాయ అధికారి, ఆస్ఐ, ఏఆర్డిలకు స్పష్టం చేశారు.