మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వలస బాల కార్మికులను గుర్తించి, వారికి విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా మంగళవారం ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, బాలల హక్కులను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.