జడ్చర్ల నుండి హైదరాబాద్ వెళుతుండగా షాద్నగర్ బస్సులో ఫోన్ మర్చిపోయిన ప్రయాణికుడికి ఆర్టీసీ సిబ్బంది ఆ సెల్ఫోన్ను ఆదివారం తిరిగి అప్పగించారు. జడ్చర్ల బస్టాండ్లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ గైడ్ శివ రాములు, సెక్యూరిటీ సిబ్బంది లింగంపేట నర్సింహులు ఆ ఫోన్ను గుర్తించి, ప్రయాణికుడికి అప్పగించారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు.