ప్రారంభమైన పది మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేం ద్రంలో ని మహబూబ్‌నగ ర్‌ గ్రామర్‌ స్కూల్‌లో బుఽధవారం మఽఽధ్యా హ్నం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఉపా ధ్యాయు లు ఉత్తర్వులతో వచ్చి మూల్యాం కన కేంద్రంలోనే రిపోర్టు చే శా రు. మూడు విడతల్లో నిర్వహించే స్పాట్‌ మొదటి విడతలో తెలుగు, ఇంగ్లీష్‌, గణితం సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంక నం ప్రారంభం అయ్యింది. మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేటకు చెం దిన ఉపాధ్యాయులు స్పాట్‌కు హాజరయ్యా రు. స్పాట్‌ కేంద్రాన్ని డీఈవో క్యాంఫు ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ క్యాంప్‌ అధికారి మొరజుల్లాఖాన్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా అధికారి కమలాకర్‌వర్మ తదితరులు ప ర్యవేక్షించారు. స్పాట్‌ మొదటి రోజు కావడం తో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూ ల్యాంకనం ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్