నాగర్ కర్నూల్: అటవీ భూముల సంరక్షణకు కఠిన చర్యలు: కలెక్టర్

మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అటవీ భూముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణపై సమీక్ష నిర్వహించారు. సైలెంట్ జోన్ల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అక్రమ ఆక్రమణలు, నరికివేతపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నల్లమల పునరావాస పనులను వేగవంతం చేసి, బాధితులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్