ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బీఎల్ఓ యాప్లో స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 21, 15 వార్డులలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆయన మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటర్ల సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయడంపై ఆయన దృష్టి సారించారు.