మందమర్రి ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందవలసిన అన్ని టర్మినల్ బెనిఫిట్స్ ను నిర్దిష్ట గడువు లోపల మంజూరు చేయాలని, కారుణ్య నియామకాల ప్రక్రియను ఆలస్యం చేయకుండా అర్హులైన వారికి వేగంగా పూర్తి చేయాలని మందమర్రి ఏరియా డీజీఎం పర్సనల్ అశోక్ సూచించారు. శనివారం మందమర్రి జిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.