మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కేంద్ర హోం శాఖ కోరింది. రేపు ఉ.11:45 గంటలకు ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రేపు ఉ. 8.30 గంటల నుంచి 9.30 వరకు ఏఐసీసీ ఆఫీస్లో పార్థీవదేహం ఉండనుంది. రేపు ఉ. 9.30 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.