రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, బోధన విధానం, విద్యార్థినుల నేర్చుకునే స్థాయిని ఆమె సమగ్రంగా పరిశీలించారు. విద్యా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, స్వయంగా 10వ తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. మెనూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.