మనోహరాబాద్ 132 కేవీ సబ్ స్టేషన్లో శివంపేట మండలానికి సంబంధించిన ఫీడర్లో డిస్క్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటన కారణంగా తూప్రాన్, మనోహరాబాద్, శివంపేట మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి రాగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఏఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.