గోతులమయం అయిన కాగజ్‌మద్దూరు–నర్సాపూర్ రహదారి

నర్సాపూర్ మండలంలోని కాగజ్‌మద్దూరు నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారి వర్షాలకు బురదమయంగా మారి, భారీ గోతులతో వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, రహదారిని వెంటనే మరమ్మతు చేసి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్