నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దమతాండ, గూడెం గడ్డ రోడ్లు గుంతలమయంగా మారడంతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్లపై చిన్నపాటి వర్షం పడితే బురదమయంగా మారుతున్నాయి. ఈ దుస్థితిపై స్థానిక వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.