మిర్యాలగూడ: 'ఎప్పటికప్పుడు ప్రభుత్వ చలాన్ చెల్లించాలి'

గ్రంథాలయ సెస్ కింద వసూలు చేసిన మొత్తాన్ని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ చలాన్ చెల్లించాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో గ్రంథాలయ సెస్ వసూలు, వినియోగంపై నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు వసూలు చేసే ఆస్తిపన్ను కు అదనంగా గ్రంథాలయ సెస్ లెవీని వసూలుచేసి గ్రంథాలయ సంస్థకు జమ చేయాల్సి ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్