జిల్లా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బుధవారం నల్గొండ క్లాక్ టవర్ వద్ద అడిషనల్ ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో, బైక్లకు అమర్చిన 72 మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ధ్వని కాలుష్యం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.