NEET-UG 2024 కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివిధ హైకోర్టుల్లో NEETకు సంబంధించి పెండింగ్లో ఉన్న పిటిషన్లతో పాటు తాజా పిటిషన్లను జూలై 8న విచారణ చేయనున్నట్లు పేర్కొంది.