అస్సాం ప్రభుత్వం బహుభార్యత్వాన్ని నేరంగా పరిగణిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం బహుభార్యత్వానికి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అయితే, ఆరో షెడ్యూల్ పరిధిలోని షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం వర్తించదు. అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ మాట్లాడుతూ, ఈ చట్టం అన్ని మతవర్గాలకు వర్తిస్తుందని, ఇది కేవలం ఇస్లాంకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని స్పష్టం చేశారు.