శనివారం, పెంబి మండలంలోని కోసగుట్ట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీపీవో శ్రీనివాస్, తహసిల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.