నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, ఈసారి తన భార్యను బరిలోకి దించుతున్నారు. సర్పంచ్గా కాకుండా, భార్యతో కలిసి వార్డు మెంబర్గా పోటీ చేసి, ఇద్దరూ గెలిస్తే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని ప్రణాళిక రచించారు. దీనికోసం అనుకూలమైన వార్డును వెతుకుతూ ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్గా పోటీ చేసే అవకాశం లేని చోట్ల, ఉప సర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలనే యోచనలో కొందరు నాయకులు ఉన్నారు.