నగరంలోని ఖిల్లా ఈద్గా వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈద్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం దృష్ట్యా షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అత్యవసరాల కోసం అంబులెన్స్ను సిద్ధంగా ఉంచారు. సీపీ సాయిచైతన్య పర్యవేక్షణలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రార్థనా స్థలాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పహారా కాశారు. సీపీ ఖిల్లా ఈద్గా, బోధన్లోని ఈద్గాలను సందర్శించారు.