జిల్లాలో 20 మంది సబ్-ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ) బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందల్వాయి ఎస్సై సందీప్ను ధర్పల్లి ఎస్సైగా, ధర్పల్లి ఎస్సై సామ శ్రీనివాస్ను వీఆర్కు అటాచ్ చేశారు. వీఆర్లో ఉన్న సుమలతకు ఇందల్వాయి ఎస్హెచ్వో బాధ్యతలు అప్పగించారు. కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డిని మాక్లూర్కు, మాక్లూర్లో కొనసాగుతున్న ఎస్సై రాజశేఖర్ను బోధన్ రూరల్ పీఎస్కు బదిలీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న మచ్చేందర్ను ఎస్బీకి అటాచ్ చేశారు. వెయిటింగ్లో ఉన్న శ్రీనివాస్ను కోటగిరి ఎస్సైగా, కోటగిరిలో ఉన్న సునీల్ను ఐదో టౌన్ ఎస్సై–1గా నియమించారు.