దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును మరమ్మతులు, డబ్లింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచనున్నారు. 4వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత గేటును తెరిచి రాకపోకలను పునరుద్ధరిస్తారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మొకనపల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా ప్రయాణించాలని కోరారు.