TG: హైదరాబాద్ సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఈ సేవలు ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో మొత్తం 22 విభాగాల్లో ఓపీ సేవలు మొదలయ్యాయి. పేషంట్లను పరిశీలించి వైద్యులు అవసరమైన టెస్టులను రాస్తున్నారు. అలాగే రోగులకు అవసరమైన మందులను అందజేస్తున్నారు.