జమ్మూలోని కనాచక్ సెక్టార్లో భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. నిన్న రాత్రి భారత డ్రోన్ సాధారణ నిఘా నిర్వహిస్తున్న సమయంలో, సరిహద్దుకు అవతలి వైపు ఉన్న పాకిస్థానీ పోస్టుల నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిగాయి. భారత డ్రోన్కు ఎలాంటి నష్టం జరగనప్పటికీ, ఈ చర్యను భారత రక్షణ వర్గాలు బాధ్యతారహితమైనదిగా భావిస్తున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సరిహద్దు దళాలకు ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.