గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎరియిండియా విమానంలో మొత్తం 242 మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. వీరిలో 12 మంది సిబ్బంది, విమాన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీసు, ఒక కెనడియన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం కుప్పకూలిన ఘటనలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ పోలీసులు ప్రకటించారు.