తెలంగాణలో విద్యార్థుల కోసం ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యా కమిషన్కు CM రేవంత్ ఆదేశించారు. శుక్రవారం విద్యా కమిషన్, విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలన్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, టీచర్ల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాన్ని సీఎం వివరించారు.