HYD: నేరేడ్మెట్ బాలికపై 10 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ నుంచి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కూల్డ్రింక్లో గంజాయి కలిపి అమ్మాయికి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.