రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ కు ఆరే కటిక సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అరే కటిక నాయకులు, చికెన్ సెంటర్ యజమానులు తమ వ్యాపార నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కోళ్ల సరఫరా కంపెనీలు తక్కువ కమిషన్లు ఇస్తున్నాయని, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడినా సరైన లాభం రావడం లేదని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.