మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుపై నమోదైన FIRను కోర్టు కొట్టిపారేసింది. స్థిరాస్థి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావులను నిందితులుగా చేర్చారు. హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఆరోపణలను తోసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్