తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వార్డు వారీ రిజర్వేషన్లు ఖరారు చేసి, జాబితాలను జిల్లాల కలెక్టర్లకు పంపిస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానాలు కేటాయించగా, బీసీ రిజర్వేషన్ను 22%లోపే ఉంచుతూ మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ రిజర్వేషన్లను ఖరారు చేసింది.