తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల సెలవు మంజూరు చేసింది. అయితే ఈ సెలవులు ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారా? ప్రభుత్వమే ఇచ్చిందా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. కాగా ఈ నెల రోజులు టీజీఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీగా రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర మోహన్ను సంస్థలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి తాత్కాలికంగా ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది.