కంది పరిధిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని బెరక్లూ, గదులు, వంటగది, బాత్రూంలు, జైలు ఆవరణ మొత్తాన్ని పరిశీలించి, ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలు, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికి ఉచిత న్యాయ సేవలు అందించి, న్యాయవాదిని నియమిస్తామని ఆమె తెలిపారు.