సంగారెడ్డి పట్టణం, మహిళా ప్రాంగణం సమీపంలోని వృద్ధాశ్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం సందర్శించారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆట పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అనంతరం, అందుల సౌండ్ లైబ్రరీని కూడా పరిశీలించారు.