సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది తమ సమస్యలను విన్నవించగా, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగింది.

సంబంధిత పోస్ట్