సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లలో పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నేరుగా సోమవారం రోజు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.