హనుమాన్ జయంతి, ఊరేగింపు సందర్భంగా సదాశివపేట పట్టణంలో పోలీసు బందోబస్తును ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం పరిశీలించారు. శోభాయాత్ర జరిగే రోడ్లను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం లోపలి కోట హనుమాన్ మందిరంలో ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.