జహీరాబాద్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.