కంది గ్రామపంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి శనివారం ఆకస్మికంగా పర్యటించి, రోడ్డుపై చెత్త వేస్తున్న దుకాణదారులను మందలించారు. వారిచేతనే చెత్తను ఎత్తించి, ఇకపై రోడ్డుపై చెత్త వేస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కందిలో సంపూర్ణ పారిశుధ్యం సాధించేలా కృషి చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు.