కేజీబీవీల్లో ఏడు కొత్త కోర్సులు

TG: రాష్ట్రంలోని 495 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఏడు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంజినీరింగ్‌లో మాత్రమే లభ్యమయ్యే కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌తో పాటు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మా టెక్నాలజీ, అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌, అగ్రికల్చర్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టారు. 403 కేజీబీవీల్లో ఇంటర్ విద్య అమలులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్