YSRTP అధ్యక్షురాలు షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు తెలిపారు. ఇది ఆంధ్రా ప్రజలకు శుభవార్తని వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ కాంగ్రెస్ బలపడాలని, షర్మిల బాగా పనిచేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండాలని ఆశించారు.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి