సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని, తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయంలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించి, డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారం వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు.