సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గీతా కార్మికులు ధర్నా నిర్వహించారు. తాటి చెట్టు పై నుండి మరణించినవారికి, వికలాంగులకు గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా తక్షణమే విడుదల చేయాలని, అర్హులైన వారికి కొత్త పెన్షన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. B. అరుణ్ కుమార్, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, K. కొమరయ్య పాల్గొన్నారు.