అస్వస్థతకు గురైన సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోన్న ఆయన సోమవారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపాయి. కాగా మరో రెండు రోజుల్లో విధులకు హాజరవుతారని పేర్కొన్నాయి. కాగా జులై 12న హైదరాబాద్‌లోని లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్