హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్గా సతీష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ శ్రీనివాస్ బదిలీపై వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు నూతన కమిషనర్ను అభినందించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.