మునగాల, చిలుకూరులకు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్‌గా ఎడ్ల పల్లి

కోదాడకు చెందిన సీనియర్ న్యాయవాది ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండో ఏడీఎం కోర్టు పరిధిలోని మునగాల, చిలుకూరు మండలాలకు సేవలు అందిస్తారు. వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న నిరుపేదలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. ఈ నియామకంపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్