సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ భేటీలు, పనుల పురోగతిపై సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి చర్చించనుంది. మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై NDSA, విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్టాంప్స్& రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.