ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1‌కు ఆమోదం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు జరిగిన తెలంగాణ తొలి ఈ-కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు, దీనిపై ఉన్న అభ్యంతరాల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్లతో ఆమోదం లభించగా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, ప్రభుత్వ నిర్మాణాలకు స్థలాల కేటాయింపునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్