మహారాష్ట్రలోని నాగపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగపూర్లోని రెండు గ్రూప్ల మధ్య హింస చెలరేగింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు రాళ్లు విసరడంతో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. దీంతో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి.. బాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రజలు శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.