ఇరాన్తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో, అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని పెంచుతూ 3,500 మంది మెరైన్లు, నావికులతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ను మోహరించింది. ఈ బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరాయని, యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకపై వచ్చాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ బృందంలో దాదాపు 3,500 మంది సైనికులతోపాటు, రవాణా, ఫైటర్ విమానాలు, దాడులకు అవసరమైన ఇతర యుద్ధ సామాగ్రి కూడా ఉన్నాయి.