తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. రూ.12,600 కోట్లతో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఈ నెల 18న అమ్రాబాద్ లోని మాచారంలో సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలిపింది. STSDF కింద రాబోయే ఐదేళ్ల పాటు RoR భూములను కలిగి ఉన్న ST రైతులకు భూమి అభివృద్ధి, ఉద్యానవన అభివృద్ధి & సోలార్ పంప్ సెట్ (ఆఫ్-గ్రిడ్) ఆధారిత నీటిపారుదల సౌకర్యాన్ని ఈ పథకం ద్వారా అందించనున్నారు. RoFR భూముల సమగ్ర అభివృద్ధి చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.